Kothagudem: కేటీపీఎస్‌ పాత ప్లాంట్‌ కూలింగ్‌ టవర్ల కూల్చివేత..

  • కూల్చివేత దశకు చేరుకున్న ఓఅండ్‌ఎం ప్లాంట్‌..
  • నేలకొరిగిన 8 యూనిట్ల ఎనిమిది కూలింగ్ టవర్లు..
  • ఇవాళ ఉదయం కూల్చివేసిన అధికారులు..
Kothagudem

Kothagudem

Kothagudem: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి విద్యుత్‌ను అందించిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) ప్లాంట్‌ కూల్చివేత తుదిదశకు చేరుకుంది. ఓ అండ్ ఎంకు చెందిన 8 యూనిట్ల ఎనిమిది కూలింగ్ టవర్లు నేలకొరిగాయి. అధికారులు ముందుగా నాలుగు టవర్లను కూల్చివేసి, మరో నాలుగు టవర్లను తొలగించారు. ఓఅండ్‌ఎం ఫ్యాక్టరీ మూతపడటంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల విస్తీర్ణాన్ని వినియోగించుకునేందుకు యాజమాన్యం టవర్లను పేల్చివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల మోడల్ కోడ్ అమలులో ఉన్నందున కూలింగ్ టవర్ల కూల్చివేతకు అనుమతి ఆలస్యమైంది.

Read also: Mallu Bhatti Vikramarka: మధిరలో ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రం.. రింగ్ రోడ్ల నిర్మాణాకి ప్రణాళికలు..

×
×
Ad

జెన్‌కో ద్వారా టెండర్లు ఆహ్వానించగా, హెచ్‌ఆర్ కమర్షియల్‌కు కొన్ని నెలల క్రితం రూ.485 కోట్లకు కాంట్రాక్ట్ వచ్చింది.100, 120 మీటర్ల ఎత్తులో కూలింగ్ టవర్లు పాత KTPS ప్లాంట్‌లో ఇప్పటికే గత ఫిబ్రవరిలో నేలమట్టం చేశారు. 1965-67 నుండి 78 వరకు దశలవారీగా నిర్మించిన ఎ, బి, సి పవర్ స్టేషన్లలో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఎనిమిది కూలింగ్ టవర్లు నిర్మించబడ్డాయి. ఇందులో భాగంగా అప్పటి కర్మాగారానికి సంబంధించిన మెటీరియల్ మొత్తాన్ని కంపెనీ తీసుకుంది. మిగిలిన 8 కూలింగ్ టవర్లను ఇవాళ (సోమవారం) ఉదయం 8 గంటలకు కూల్చివేశారు. ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా, అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా పడింది. కాగా, టవర్ల కూల్చివేత సందర్భంగా ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్లలో అధికారులు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
Double Ismart: లైగర్ పంచాయతీ.. రంగంలోకి టాప్ డిస్ట్రిబ్యూటర్.. కొలిక్కి వచ్చేనా..?