బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మునవర్ ఫారూఖిను తెలంగాణలో అడుగుపెట్టనిచ్చే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు అందరూ నాస్తికులేనని… నేనే అసలైన హిందువని…చెప్పుకునే కేసీఆర్… ముందుగా కుమారుణ్ణి భక్తుడిగా మార్చాలని చురకలు అంటించారు.
స్వార్థం కోసమే సీఎం కేసీఆర్ యాగాలు చేస్తారని ఆగ్రహించారు. మునవర్ ఫారూఖీ వంటి మూర్ఖులకు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని మండిపడ్డారు. యువ మోర్చా నేతలు అలాంటి మూర్ఖుడు తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వాజ్ పేయి స్పూర్తితో శక్తివంతమైన తెలంగాణను నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తపైనా ఉందన్నారు బండిసంజయ్.
