Autos Allowed on Yadadri: యాదాద్రి కొండపైకి ఆటోల అనుమతి.. ఎప్పటి నుంచి అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Autos Allowed on Yadadri: తెలంగాణలో అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా యాదాద్రిలో నరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ప్రస్తుతం యాదాద్రి కొండపైకి ఆర్టీసీ బస్సులు మాత్రమే వస్తున్నాయి.. అన్ని వాహనాలను అనుమతించడం లేదు. సొంత వాహనాల్లో కొండపైకి వెళ్లాలనుకునే భక్తులకు పార్కింగ్ ఫీజులు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో యాదాద్రి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇక నుంచి యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతిస్తారు. ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు ఫిబ్రవరి 11 నుంచి మొదటి ఘాట్ రోడ్డు ద్వారా ఆటోలను కొండపైకి అనుమతించాలని నిర్ణయించినట్లు ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ప్రకటించారు. యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించాలని నిర్ణయించారు. రోజుకు 100 ఆటోలు షిఫ్టుల వారీగా కొండపైకి నడుస్తున్నాయని వివరించారు.
Read also: Telangana Govt: రాష్ట్రంలో ‘హెల్త్ కార్డు – డిజిటల్ రికార్డు’! కానీ.. ఏజ్ లిమిట్ ఉందండోయ్..
Also Read
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
మొదటి షిప్టు ఉదయం 3 గంటల నుంచి ఒంటి గంట వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఒక్కో షిఫ్టులో 50 ఆటోలు నడపాలి. కొండపైన 25 ఆటోలు ఉంటే మరో 25 ఆటోలు కొండ కింద ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు కొన్ని దిశానిర్దేశం చేశారు. ఒక్కో ఆటోలో డ్రైవర్తో పాటు ముగ్గురు ప్రయాణికులను మాత్రమే అనుమతించాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ వంటి అన్ని రకాల సర్టిఫికెట్లు కలిగి ఉండాలన్నారు. ఇంకా ఆటో డ్రైవర్లపై నిరంతర నిఘా ఉంటుందని వివరించారు. ఆటో చార్జీలు ఎంతమేరకు నిర్ణయించాలనేది ఆటోడ్రైవర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. యాదాద్రి కొండపై భక్తులకు కనువిందు చేసేందుకు వీలుగా పదిరోజుల్లో డార్మెటరీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని బిర్లా ఐలయ్య తెలిపారు.
Liquor Maker : లగ్జరీ ప్రీమియం విస్కీని విడుదల చేసిన రాడికో ఖైతాన్ కంపెనీ
కొండపైకి ఆటోలను 12 ఏప్రిల్ 2022 నుంచి అనుమతించకపోవడంతో యాదగిరిగుట్ట ఆలయ అధికారులపై ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.. గుట్టపైకి ఆటోల రవాణాకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆటోడ్రైవర్లు ఆలయం ఎదుట ఆందోళన చేసారు. ఎన్నో ఏళ్లుగా వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని అన్నారు. చాలా మంది భక్తులకు,వృద్ధులకు,వికలాంగులు కూడా దర్శనం కోసం కొండకు చేరుకోవడానికి తాము సహాయం చేస్తున్నామని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో కొండపైకి ఆటోలను నిషేధించారని, మాకు కష్టాలు తప్పవని ఆటోడ్రైవర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం మారడం ఆటోవాళ్ల కష్టాల్లో వెలుగు రావడం అయ్యిందని పలువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లను కొండపైకి అనుమతించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!