Wi-Fi on Mars: భూమి తర్వాత సౌర కుటుంబంలో నివసించే యోగ్యత కలిగిన గ్రహాంగా ‘‘అంగారకుడు(Mars)’’కు పేరుంది. మార్స్పైకి మానవుడిని పంపించేందుకు, అక్కడే నివసించే అనువైన పరిస్థితులు కల్పించేందుకు నాసాతో సహా పలు ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, జెఫ్ బెజోస్కు చెందిన అంతరిక్ష సంస్థ రెడ్ ప్లానెట్పై Wi-Fiని అందించేందుకు ప్లాన్ చేసింది.
బ్లూ ఆరిజిన్ తన Wi-Fiని మార్స్ టెలికమ్యూనికేషన్ ఆర్బిటర్ (MTO)ను ఆవిష్కరించింది. భవిష్యత్తులో మార్స్ మిషన్లకు ఎలాంటి డేటా అవాంతరాలు ఎదురుకాకుండా భూమికి సమాచారాన్ని చేరవేసేందుకు ఈ అధునాతన శాటిలైట్ను ప్రయోగించనున్నారు. బ్లూ ఆరిజిల్ 2028లోపు దీనిని ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్బిటర్ డీప్ స్పేస్ నెట్వర్క్కు వెన్నెముకగా మారే అవకాశం ఉంది.
Read Also: Shocking: ప్రేమ, పెళ్లి, ద్రోహం.. సెప్టిక్ ట్యాంక్లో పుర్రె.. 6 నెలల తర్వాత తెలిసిన నిజం..
ప్రస్తుతం మార్క్ కమ్యూనికేషన్స్ పాత తరం శాటిలైట్లపై ఆధారపడి ఉంది. సౌరశక్తి, రసాయన శక్తిని కలిపి హ్రైబ్రీడ్ ప్రొపల్షన్ వ్యవస్థలు కలిగి ఉండటం ద్వారా MTO మొత్తం గేమ్ను మార్చుతుంది. ఇది అంతరిక్ష నౌక 1,000 కిలోల కంటే ఎక్కువ సరుకును తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది, వీటిలో హై-స్పీడ్ రిలే పరికరాలు, ఎడ్జ్ ప్రాసెసింగ్ కోసం అధునాతన ఏఐ ఉన్నాయి. దీనిని బ్లూ రింగ్ ప్లాట్ఫామ్పై నిర్మించారు. ఈ ఆర్బిటర్ ఇప్పటికే నిర్మాణ దశలో ఉంది.
బ్లూ ఆరిజిన్ చెబుతున్న దాని ప్రకారం, మూన్ మిషన్లలో ఉపయోగించిన టెక్నాలజీలో 80 శాతం మార్స్ మిషన్లో ఉపయోగించవచ్చు. ఎంటీఓ ద్వారా మార్స్ నుంచి హై డెఫినేషన్ ఫోటోలు, వీడియోలు, భారీ సైంటిఫిక్ డేటానున భూమికి మరింత వేగంగా చేరవేయవచ్చు. ఇది మానవులకు మార్స్పై తొలి లైవ్ కనెక్టివిటీ అందించబోతోందని భావిస్తున్నారు.
