Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు ముఖ్యమైన సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది.. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల కాగా, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి భక్తులకు అలర్ట్ అయ్యే అవసరం వచ్చింది.. ఎందుకంటే.. శ్రీవారి దర్శనం…
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ పరిధిలోని ఆలయాలకు ధ్వజస్తంభాలు, రథాలు తయారు చేసేందుకు 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుకు పాలకమండలి ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుపతిలోని పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం సౌకర్యాల కల్పనకు రూ.48 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కోసం ఆర్కిటెక్ట్ నియామకానికి ఆమోద ముద్ర వేశామని బీఆర్ నాయుడు చెప్పుకొచ్చారు. టీటీడీ…