తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సేవలకు వెన్నెముకగా నిలిచే మీ-సేవా (MeSeva) కేంద్రాలు తాత్కాలికంగా మూతపడనున్నాయి. వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, సాంకేతిక హంగులను అద్ది వినియోగదారులకు మెరుగైన సేవలందించే ఉద్దేశంతో ఐటీ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 36 గంటల పాటు సర్వర్లు అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు. మీ-సేవా పోర్టల్లో కొత్త సాఫ్ట్వేర్ వెర్షన్ను అప్లోడ్ చేయడం , డేటా సెంటర్ల వార్షిక నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది.…