భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఒక ఆసక్తికర అనుభవాన్ని ఇటీవల వెల్లడించాడు. ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్లో తొలిసారి అడుగుపెట్టిన రోజు జరిగిన సంఘటన తన జీవితంలో ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పాడు. తాను మొదటిసారి ముంబై డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లినప్పుడు కూర్చోవడానికి కూడా స్థలం లేదని గుర్తుచేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ తనకు కూర్చోవడానికి స్థలం ఇచ్చారని, ఆ స్థలమే…