పారిస్ ఒలింపిక్స్లో ఈరోజు (మంగళవారం) భారత్ను మరో పతకం వరించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మను, సరబ్జోత్లు కాంస్య పతకాన్ని గెలిచి.. భారత్కు రెండో పతకాన్ని అందించారు. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే.. మహిళల వ్యక్తిగత ఆర్చరీ రౌండ్ ఆఫ్ 16 ప్రీక్వార్టర్స్కు చేరుకుంది. భజన్ కౌర్ 7-3తో ఇండోనేషియాకు చెందిన సైఫాను ఓడించింది.
జులై 30 .. పారిస్ ఒలింపిక్ లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించిన రోజు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరులో సరబ్జోత్ సింగ్-మను భాకర్ సింగ్ కలిసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత్కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్ ఫైనల్స్కు చేరుకోవడంలో విఫలమయ్యారు. ఈ ఈవెంట్లో 33 మంది షూటర్లు పాల్గొన్నారు.