Crime: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలోని టాండా పోలీస్ స్టేషన్ పరిధిలోని సైద్ నగర్ వద్ద ఒక యువకుడి మృతదేహం కనిపించింది. మోటార్ సైకిల్ ప్రమాదంలో చనిపోయాడని అంతా భావించారు. ఈ ఘటన మార్చి 13 రాత్రి జరిగింది. అయితే, పోలీసులు మృతుడి ముఖం, గొంతుపై గాయాలు చూడటంతో పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూశారు. రిపోర్టులో గొంతు నులిమి చంపినట్లు తేలింది.