ఈజిప్టులో జరిగిన తాజా పురావస్తు తవ్వకాలు ప్రపంచవ్యాప్తంగా చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. సుమారు 3,000 ఏళ్ల నాటి ప్రాచీన రహస్యాలను మోసుకొస్తున్న ఎనిమిది అరుదైన పాపైరస్ స్క్రోల్స్ (పత్రాలు) బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ అద్భుతమైన ఆవిష్కరణకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమైన ఆవిష్కరణ.. ఈజిప్టు పర్యాటక , పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. లక్సర్లోని క్వర్నా ప్రాంతంలో ఈ తవ్వకాలు జరిగాయి. అక్కడ ‘సెనెబ్’ సమాధికి సమీపంలో…