"నేను పార్లమెంట్ లో నమాజు చేస్తాను కానీ వందేమాతరం మాత్ర పాడను" ఇది ఒక కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ ఆవరణలో ఇచ్చిన స్టేట్మెంట్. భారత స్వాతంత్ర్యోద్యమంలో వందేమాతరం ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశించడాన్ని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘వందే మాతరం’ గీతం పాడే సమయంలో తప్పనిసరిగా అందరూ నిలబడాలన్న అంశంపై ఇమ్రాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నేడు (డిసెంబర్ 1న) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజు ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలకు, ఎన్నికలు జరగనున్న అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) అంశంపై ప్రతిపక్ష నాయకులు తరచుగా అంతరాయం కలిగించారు. గందరగోళం కారణంగా, లోక్సభ రోజంతా స్తంభించిపోయింది. సమావేశానికి ముందు, ప్రధాని మోడీ ప్రతిపక్ష నాయకులను సహకరించాలని, ఉభయ సభలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీలతో ఏకాభిప్రాయం సాధించడానికి, సభ సజావుగా…