కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేసింది.. ఇక, మహారాష్ట్రలో చెప్పాల్సిన పనేలేదు.. అందులో ముంబై ఎదురైన అనుభవం మామూలుదికాదు.. అయితే, ఇప్పుడిప్పుడే కరోనా నుండి తేరుకుంటున్న ముంబై ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులగా కురిసిన వర్షాలతో ముంబై మొత్తం జలమయమైంది. ఇప్పటికే ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ అధికారులు ప్రజలకు సూచనలు సైతం చేశారు. ఈ క్రమంలో ముంబై వాసులకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. వచ్చే…
మహారాష్ట్రలో తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ముంబైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భారత వాతావరణవాఖ.. నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే రెండు రోజుల ముందే రావడంతో ముంబైలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గడ్ లకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది… ఈ విషయాన్ని ఐఎండీ ముంబై…