Missile Misfire: రాజస్థాన్ జైసల్మేర్ లోని పోఖ్రాన్ వద్ద ఆర్మీ మిస్సైల్ మిస్ ఫైర్ అయింది. ఆర్మీ యూనిట్ ఫీల్డ్ ప్రాక్టీస్ చేస్తుండగా మిస్సైల్ మిస్ ఫైర్ అయింది. భారత ఆర్మీ చెబుతున్నదాని ప్రకారం క్షిపణి విమానంలో పేలింది. పోఖ్రాన్ రేంజ్ లో ఈ ఘటన జరిగింది. క్షిపణి విమానంలో ఉండగా పేలింది. శిథిలాలు పక్కన ఉన్న పొలాల్లో పడిపోయాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆర్మీ తెలిపింది. దీనిపై విచారణ ప్రారంభించారు.