కర్ణాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం నిదానంగా దేశ వ్యాప్తంగా విస్తరించబోతోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపుతో నిరసనకారులను కట్టడి చేస్తుంటే, మరికొన్ని రాష్ట్రాలలో ఆ వివాదాలను అడ్డం పెట్టుకుని తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ వివాదం ఇంకా సద్దుమణగక ముందే ఇవాళ విడుదలైన విష్ణు విశాల్ ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీతో మరో వివాదానికి తెర లేపినట్టు అయ్యింది. ఇందులో హీరో ముస్లిం, అలానే ప్రతినాయకుడు ముస్లిం టెర్రరిస్ట్. దేశంలో అరాచకం సృష్టించడం కోసం టెర్రరిస్టు ప్రయత్నం…