Cognizant: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం భయాలు టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, యాక్సెంచర్ వంటి సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ జాబితాలో మరో టెక్ సంస్థ కాగ్నిజెంట్ కూడా చేరింది. 2023లో తమ ఆదాయాలు తగ్గుముఖం పట్టడంతో కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. కాగ్నిజెంట్కు ప్రధాన ఆదాయం యూఎస్ నుంచి వస్తోంది.
Google India Lay Off: గతేడాది చివర్లో ప్రారంభం అయిన టెక్ లేఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా గూగుల్ ఇండియా భారతదేశంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 453 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం అర్థరాత్రి ఉద్యోగులకు మెయిల్ ద్వారా తొలగింపు గురించి…