ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు అమ్ముకునే యువతి మోనాలిసా గుర్తుందా? తన మత్తెక్కించే కళ్లతో.. సోయగంతో కుర్రాళ్ల మదిని దోచేసింది. పుణ్యాస్నానాలకు వెళ్లిన యువకుల్లో కొందరు మోనాలిసా ఫోటలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో ఫేమస్ అయిపోయింది. ఎంతలా అంటే ఓ సెలబ్రిటీ రేంజ్ లో. దీంతో అమ్మడికి సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. పలు సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉంటే…
ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగిన కుంభమేళాలో ఎంతో మంది బాగా సంపాదించుకుని సెటిల్ అయ్యారు. అయితే ఈ కుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్ అయిన మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా భౌన్స్లే మాత్రం ఒక్కసారిగా తన తేనె కళ్లతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దెబ్బకు ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. బాలీవుడ్లో ఒక సినిమా మొదలై ఆగిపోగా, తెలుగులో కూడా ఆమెను హీరోయిన్గా లాంచ్ చేస్తూ ‘లైఫ్’ అనే సినిమా ప్రారంభమైంది. సాయి చరణ్ హీరోగా…