Stampede: బీహార్లోని నలంద జిల్లాలో గల శీతలా మాత ఆలయం (Sheetala Mata Mandir)లో మంగళవారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయాలయినట్లు సమాచారం. మంగళవారం ప్రత్యేక పూజల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఈ ఘటన జరిగింది. విషాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే, పోలీసు అధికారులు స్థానిక గ్రామస్థులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక…