Delhi Car Blast: ఢిల్లీ ఉగ్రదాడిపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కేవలం i20 లేదా EcoSport కార్లను మాత్రమే కాకుండా, మరో రెండు పాత వాహనాలను పేలుడు పదార్థాలతో నింపడానికి సిద్ధమయ్యారు. అనేక ప్రదేశాల్లో దాడులు నిర్వహించడానికి వీలుగా అదనపు వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ సమాచారాన్ని అనుసరించి, ఏజెన్సీలు ఇప్పుడు ఈ అదనపు…
దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో ఇప్పటివరకు 9 మంది మరణించగా.. 20 మంది గాయపడ్డారు. పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దర్యాప్తు సంస్థల ప్రకారం.. కారులో పేలుడు పదార్థాలు అమర్చి బ్లాస్ట్ చేశారు. ఇది ఆత్మాహుతి దాడి అని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఢిల్లీ ఎర్రకోట పేలుడుకు ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉందని తేలింది. పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు…