చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్ దోమల్ గూడలో జరిగింది. గగన్ మహల్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ కీచక టీచర్ ఉదంతం బయటపడింది. పిల్లల ఫోటోలు తీస్తూ బెదిరించాడు, తాను చెప్పినట్లు వినాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఈ కీచక టీచర్ శ్రీనివాస్ ప్రవర్తనతో విద్యార్థినులు స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నారు. తల్లిదండ్రులు విషయం తెలుసుకొని స్కూల్ లో టీచర్ ను నిలదీశారు. గత కొంతకాలంగా పిల్లలతో, తోటి…