GPO : రాష్ట్రంలోని గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ దిశగా భూభారతి ఆర్వోఆర్-2025 చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ, గ్రామ పాలన అధికారుల నియామకం (జీపీవో) అవసరమవుతున్న నేపథ్యంలో, సంబంధిత ప్రక్రియను వేగవంతం చేస్తోంది. పూర్వపు వీఆర్వోలు , వీఆర్ఏల ఎంపికకు సంబంధించి పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరీక్షను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో టీఎస్పీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్)కి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ప్రతి జిల్లా…