Vizianagaram SP: విజయనగరం జిల్లా బాడంగి మండలంలోని ముగడ కాలనీలో దారుణం జరిగింది. ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు గద్దె కృష్ణవేణిని దొంగలు దారుణంగా చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, వృద్దరాలు హత్య కేసును పోలీసులు ఛేదించారు.
జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేదార్నాథ్లో భారీ స్థాయిలో బంగారం కుంభకోణం జరిగిందని చెప్పారు. 228 కిలోల బంగారం కనిపించడం లేదని అన్నారు. దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. దీనికి బాధ్యులైన వారి వివరాలు బయటకు తీసుకురావాలన్నారు.
Lucknow News: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేలో 11 కిలోల బంగారంతో స్మగ్లర్ను డిఆర్ఐ అరెస్టు చేసింది. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్లో రూ.8 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు.
ప్రపంచ కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలంటే మామూలుగా ఉంటాయి. అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. మార్చి 1 నుంచి 3 వరకు చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈరోజు బంగారం కొనాలేనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్ నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలే ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్నాయి.. బంగారం, వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తుంది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,350, 24 క్యారెట్ల ధర రూ.72,380 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 96,500 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి…
లెక్కల్లో చూపని రూ.2 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కమిషనర్ టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ బృందం పట్టుకుంది. జూన్ 14న, ఇద్దరు నిందితులు, బజ్జూరి పూర్ణచందర్ (49), సయ్యద్ బాబా షరీఫ్ (25) ఇద్దరూ వరుసగా మెట్టుగూడ మరియు వరంగల్ నివాసితులు చెల్లుబాటు అయ్యే పత్రాలు సమర్పించడంలో విఫలమైనప్పుడు సికింద్రాబాద్లోని మెట్టుగూడలోని అపర్ణ ఉస్మాన్ ఎవరెస్ట్ అపార్ట్మెంట్ సమీపంలో అరెస్టు చేశారు. Bangalore: బెంగళూరు-తిరుపతి హైవేపై ప్రమాదం.. ముగ్గురు యువకుల…
మెదక్ జిల్లా నర్సాపూర్లో డబుల్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. జల్సాలకు అలవాటుపడి తల్లి ఒంటిపై బంగారం కోసం తల్లిదండ్రులను హతమార్చాడు ఓ కసాయి కొడుకు. గత నెల 22న ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన 25 రోజుల తర్వాత ఈ కేసులో మిస్టరీ వీడింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యునైటెడ్ కింగ్డమ్ నుండి 100 టన్నుల బంగారాన్ని భారతదేశానికి తిరిగి తీసుకువస్తుంది. RBI యొక్క ఆర్థిక విధానంలో ఇది ఒక పెద్ద మార్పు, ఎందుకంటే ఇది ఇప్పుడు దాని స్వంత ఖజానాలో ఎక్కువ బంగారాన్ని కలిగి ఉంటుంది. వన్నె తగ్గని అపురూప ఖనిజం బంగారం. ముఖ్యంగా భారతీయులకు బంగారం అంటే చాల ఇష్టం. బంగారం అనేది కేవలం వ్యక్తులకే కాదు, దేశాలకు కూడా ఎంతో కీలకం. బంగారం నిల్వలు ఎంత ఉంటే…
ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో ఏపీలో భారీగా మద్యం, డ్రగ్స్ భారీగా పట్టుబడ్డట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఒలింపిక్స్ ముందు భారత్ స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు ఇదొక శుభపరిణామం. ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న అతను.. మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరిగిన 27వ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. బల్లాన్ని 82.27 మీటర్ల దూరానికి విసిరి పసిడి పతకాన్ని సాధించగలిగాడు.