ఎగువ ప్రాంతాల నుంచి గండిపేట జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గండిపేట జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో ఈ జలాశయం ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా ఏ క్షణంలో అయినా జంట జలాశయాల గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది. గండిపేట జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1785 అడుగులకు నీరు వచ్చి చేరింది. ఇక హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 కాగా 1762 కు నీరు వచ్చి చేరింది. మరో రెండు రోజులు ఏగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిస్తే జంట జలాశయాల…