హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటిస్తూ, అవసరమైతే తాను ‘అసెంబ్లీ నక్సలైట్’గా మారుతానని, అందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. హుజూరాబాద్ ప్రజలు ఏం పాపం చేశారని అక్కడ డంపింగ్ యార్డ్ పెడుతున్నారని ప్రశ్నించిన ఆయన, ఇది…
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. డంపింగ్ యార్డు వివాదం ఈ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డుపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టుకు స్పందించిన వైసీపీ కార్యకర్తలు బాలయ్య ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు.…