హర్యానా రాష్ట్రం గురుగావ్లో మాజీ జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ ను తండ్రి హత్య చేసిన సంగతి తెలిసిందే. రాధిక తండ్రి దీపక్ ఆమెపై వెనుక నుంచి మూడు బుల్లెట్లను పేల్చారని, దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆవేశంలో కుమార్తెను తండ్రి చంపేశాడని.. ఇప్పుడు పశ్చత్తాపంతో కుమిలిపోతున్నారని కుటుంబీకులు వెల్లడించారు.