Assam: కుటుంబ వివాదం కారణంగా ఓ వ్యక్తి దారుణ చర్యకు పాల్పడ్డాడు. అస్సాంకు చెందిన వ్యక్తి భార్య తల నరికి, ఆ తలతో పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. ఈ సంఘటన రాష్ట్రంలోని చిరాంగ్ జిల్లాలో జరిగింది. 60 ఏళ్ల బితీష్ హజోంగ్ తన భార్య బజంతి తల నరికి, ఆ తలను తన సైకిల్పై పెట్టుకుని, బల్లమ్గురి అవుట్ పోస్ట్ పోలీసుల ముందు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.