తిరుమలలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో అడుగు ముందుకేసింది. లడ్డూ కౌంటర్ల వద్ద కియోస్కి మెషిన్లు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. భక్తులు నగదు రహిత చెల్లింపులతో లడ్డూ ప్రసాదాలు పొందే సౌలభ్యం కల్పించింది. మరో వైపు అదనపు లడ్డూ నియంత్రణపై శ్రీవారి భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Digital Payments: మద్యం విక్రయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం లావాదేవీల్లో డిజిటల్ పేమెంట్లకు అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకుంది.. డిజిటల్ పేమెంట్లను ఇవాళ్టి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.. ఆన్ లైన్ లావాదేవీలను లాంఛనంగా ప్రారంభించారు ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ.. తొలుత రాష్ట్రంలోని 11 మద్యం ఔట్ లెట్లల్లో ఆన్ లైన్ లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.. మూడు నెలల్లో మిగతా మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలను అమలుకు చర్యలు…