ఏపీలో అన్నివర్గాలకు కేబినెట్ విస్తరణలో న్యాయం చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనంతనం కీలక వ్యాఖ్యలు చేశారు శాసనసభాపతి తమ్మినేని సీతారాం. సీఎం జగన్ ఆదేశిస్తే పార్టీ కోసం పని చేస్తానంటూ స్పీకర్ తమ్మినేని అన్నారు. నాయకుడికి నేను సమస్య కాకూడదు. ఎక్కడ ఉండమంటే అక్కడుంటా. పార్టీకోసం పని చేయమంటే చేస్తానన్నారు. సహజంగానే ఆశావహులు ఉంటారు. ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యమం వచ్చింది. ఈ సామాజిక న్యాయ విప్లవం ముందు ప్రతిపక్షాలు…