USA: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. బుధవారం తెల్లవారుజామున ఉగ్రవాద స్థావరాలపై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో దాడులు చేసింది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుతో పాటు పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్కి చెందిన 100 మందికి మించి ఉగ్రవాదులు హతమయ్యారు.