Do You Know Why All Group Toppers Are in Super 8 Group 1: టీ20 ప్రపంచకప్ 2026లో అత్యంత కీలకమైన సూపర్-8 దశకు రంగం సిద్ధమైంది. నేటి నుంచే సూపర్-8 పోరు ఆరంభం కానుంది. సూపర్-8కు చేరిన 8 జట్లు.. సెమీస్ బెర్తుల కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. సూపర్-8 తొలి మ్యాచ్లో టాప్ టీమ్స్ పాకిస్థాన్, న్యూజిలాండ్ కొలంబోలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. 8 జట్లు మంచి ఫామ్ మీదుండడంతో మ్యాచులు హోరాహోరీగా సాగడం పక్కా. అయితే ఈసారి జట్ల గ్రూపింగ్లో ఒక వినూత్న పరిణామం చోటు చేసుకుంది.
టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్లన్నీ సూపర్-8 పోరు కోసం ఒకే గ్రూప్లో ఉన్నాయి. రెండో స్థానంలో నిలిచిన జట్లు మరో గ్రూప్లో చోటు దక్కించుకున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందే నిర్ణయించిన సీడింగ్ విధానం వల్ల ఈ ఆసక్తికర సమీకరణం ఏర్పడింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్-8 జట్లకు ముందే సీడింగ్ కేటాయించారు. ఈ సీడింగ్ ప్రకారం జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
Also Read: Sree Vishnu Movies: టెన్షన్ మధ్య నిద్రపోని హీరో శ్రీ విష్ణు.. ఎట్టకేలకు లైన్ క్లియర్!
గ్రూప్-1 (బేసి సంఖ్య సీడింగ్స్)లో ఐసీసీ ర్యాంకింగ్స్లో 1, 3, 5, 7 స్థానాల్లో ఉన్న భారత్ (X1), ఆస్ట్రేలియా (X2), దక్షిణాఫ్రికా (X3), వెస్టిండీస్ (X4) జట్లను ఈ గ్రూప్లో చేర్చారు. గ్రూప్-2 (సరి సంఖ్య సీడింగ్స్)లో ఐసీసీ ర్యాంకింగ్స్లో 2, 4, 6, 8 స్థానాల్లో ఉన్న ఇంగ్లాండ్ (Y1), న్యూజిలాండ్ (Y2), పాకిస్థాన్ (Y3), శ్రీలంక (Y4) జట్లకు ఈ గ్రూప్లో చోటు కల్పించారు. టాప్-8 సీడింగ్లో ఉన్న ఏదైనా జట్టు సూపర్-8కు అర్హత సాధించకపోతే.. ఆ స్థానాన్ని (సీడింగ్ను) గ్రూప్ దశలో ముందంజ వేసిన ఇతర జట్టుకు కేటాయిస్తారు. ఈ నిబంధన ప్రకారమే.. ఆస్ట్రేలియాకు కేటాయించిన X2 సీడింగ్ను జింబాబ్వే సొంతం చేసుకుంది. తద్వారా జింబాబ్వే గ్రూప్-1లో తన స్థానాన్ని ఖాయం చేసుకుని బలమైన జట్లతో తలపడేందుకు సిద్ధమైంది.
