NTV Telugu Site icon

టోక్యో ఒలింపిక్స్‌.. క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

PV Sindhu

PV Sindhu

టోక్యో ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది తెలుగుతేజం, భారత స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధు… మహిళ సింగిల్స్‌ గ్రూప్‌-జేలో వరుసగా మూడు విజయాన్ని సాధించిన ఆమె.. క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది… ఇవాళ జరిగిన ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్‌ షెట్లర్‌ మియా బ్లిక్‌ఫెల్ట్‌ పై వరుస సెట్లలో విజయం సాధించారు సింధూ.. 21-15, 21-13తో ప్రత్యర్థిని చిత్తు చేసిన ఆమె.. వరుస విజయాలతో గ్రూప్‌-జేలో అగ్రస్థానంలో నిలిచింది. క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది… మరో విజయం సాధిస్తే కాంస్యం పతకం సాధించడం ఖాయం.. కాగా. ఈసారి ఎలాగైనా బంగారు పతకాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉంది పీవీ సింధు.