భారత్ మహిళల హాకీ జట్టుపై ప్రశంసలు జల్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వ క్రీడలు…ఒలింపిక్స్లో మహిళల హాకీ జట్టు ప్రదర్శనకు…దేశం మొత్తం అండగా నిలబడుతోంది. పతకం సాధించికపోయినా…అద్భుతంగా ఆడారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గుజరాత్కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి డోలాకియా…ప్లేయర్స్కు నగదు బహుమతి ప్రకటించారు.
ఒలింపిక్స్లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న భారత్ మహిళల హాకీ జట్టుపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. రాణి రాంపాల్ సేనకు…దేశం మొత్తం అండగా నిలిచింది. మహిళా బృందం అద్భుత ప్రదర్శనకు యావత్ దేశం జైకొట్టింది. మహిళల జట్టు ఒలింపిక్స్లో అత్యుత్తమంగా నాలుగో స్థానం సాధించింది. గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా భారత హకీ జట్టులోని అమ్మాయిలు సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఒక్కొక్కరికి 11 లక్షల చొప్పున ఇస్తానని ప్రకటించారు. ఇప్పటికే ఇల్లు ఉన్న వారి 5 లక్షల విలువచేసే కారు అందజేస్తామని తెలిపారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి భారత హాకీ జట్టు ప్లేయర్స్కు అదనంగా లక్ష రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు చెప్పారు.
Also Read
- Smriti Mandhana: మిథాలీ రాజ్ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్లో సరికొత్త చరిత్ర..
- Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
- Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
- Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
మరోవైపు హాకీ జట్టులో సభ్యురాలైన లాల్ రెమ్సియామికి…నజరానా ప్రకటించారు మిజోరం ముఖ్యమంత్రి జోరంథంగా. 25 లక్షల నగదు, ఇంటి స్థలంతోపాటు ఉద్యోగం ఇస్తున్నట్టు వెల్లడించారు. సొంత ఊరిలోనే ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఆమె శిక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 20 లక్షలు మంజూరు చేసింది. 21 ఏళ్ల లాల్ రెమ్సియామి మిజోరం నుంచి భారత జట్టుకు ఎంపికైన తొలి మహిళ హాకీ క్రీడాకారిణి.
టోక్యో క్రీడల్లో నాలుగో స్థానంతో చరిత్ర సృష్టించింది రాణి రాంపాల్ సేన. మెరుగైన ఫలితాలు సాధించాలంటే మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాలన్నారు చీఫ్ కోచ్ జోర్డ్ మార్జిన్. భారత్లో మహిళల హాకీ అభివృద్ధి చెందాలంటే జాతీయ లీగ్ను ప్రారంభించాలని..హాకీ సమాఖ్యకు సూచించారు. ఓడినందుకు బాధగానే ఉంటుందని…మేం గెలవాల్సిందని మార్జిన్ చెప్పారు. నిజంగా అమ్మాయిలను చూసి గర్వపడుతున్నానని వెల్లడించారు. వారు పోరాట పటిమ, నైపుణ్యాలను ప్రదర్శించారని మార్జినె తెలిపారు. ప్రపంచం సరికొత్త భారత జట్టును చూసిందని…అందుకు గర్వపడుతున్నానని స్పష్టం చేశారు.
కోచ్గా నాలుగేళ్ల కిందట భారత్లో అడుగుపెట్టిన మార్జినే..2017లో తొలుత మహిళల జట్టు కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. అదే ఏడాది పురుషుల జట్టు కోచ్గా నియమితుడయ్యాడు. 2018లో మహిళల జట్టు కోచ్గా మళ్లీ బాధ్యతలు చేపట్టాడు. తన కాంట్రాక్టును పొడిగించేందుకు హాకీ సమాఖ్య అంగీకరించినా వ్యక్తిగత కారణాలతో కొనసాగడం లేదని ప్రకటించారు.
- Tags
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!