Oval Test Thriller: నేడే క్లైమాక్స్.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లాండ్ తిరగరాస్తుందా..?
- రసవత్తరంగా కొనసాగుతున్న ఇంగ్లాండ్- భారత్ ఐదో టెస్ట్..
- భారత్ విజయానికి 9 వికెట్లు.. ఇంగ్లాండ్ కు 324 పరుగులు!..
- ఓవల్ లో ఇంగ్లాండ్ గెలిస్తే 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లాండ్ తిరగరాసినట్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oval Test Thriller: ఆండర్సన్- టెండూల్కర్ సిరీస్ లోని చివరి టెస్టు రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ తమ విజయానికి తొమ్మిది వికెట్ల దూరంలో నిలవగా.. ఇంగ్లాండ్ గెలుపుకు 324 పరుగులు కావాల్సి ఉంది. అయితే, ఐదో టెస్ట్ రెండో ఇన్సింగ్స్ లో 374 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఇక, నేడే మ్యాచ్ ఫలితంపై క్లైమాక్స్ రానుంది. ఎలాగైనా ఇంగ్లాండ్ను ఆలౌట్ చేసి సిరీస్ను సమానం చేయాలని భారత ప్లాన్ చేస్తుండగా.. సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ వ్యూహాలు రచిస్తోంది.
Read Also: LIC Bima Sakhi: మహిళల కోసం ఎల్ఐసీ గొప్ప పథకం.. ఒక్క రూపాయి కట్టకుండానే.. నెలకు రూ. 7000 పొందే ఛాన్స్
Also Read
- Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు... ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
- Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
- Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
- KL Rahul: సహచర ఆటగాళ్లను తిట్టిన కేఎల్ రాహుల్.. అసలు నిజం చెప్పేసిన మాజీ కోచ్!
ఈ నేపథ్యంలో లండన్లోని ఓవల్ మైదానంలో 1880లో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్లు పోటీపడ్డాయి. 145 ఏళ్ల ఈ మైదానం చరిత్రలో 300 రన్స్ కంటే ఎక్కువ టార్గెట్ ను ఒక్కసారి కూడా ఛేదించలేదటా.. ఈ స్టేడియంలో అత్యధిక రన్ ఛేజ్ చేసిన రికార్డు ఇంగ్లాండ్ జట్టు పేరుపై ఉంది. 1902లో ఆసీస్ తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లీష్ టీమ్ 263 రన్స్ లక్ష్యాన్ని చేధించింది. అయితే, ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ తేడాతో ఇంగ్లాడ్ గెలిచింది. ఆ తర్వాత రెండో అత్యధిక రన్ చేజ్ వెస్టిండీస్ పేరుపై ఉంది.
1963లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో విండీస్ 252 పరుగుల టార్గెట్ చేధించింది.
Read Also: Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు..
ఇక, ఓవల్ మైదానంలో మూడో అత్యంత విజయవంతమైన రన్ చేజ్గా 1972లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్పై 242 రన్స్ లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది. ఇక, ఈ మైదానంలో చివరగా 2024లో శ్రీలంక ఇంగ్లండ్పై 219 రన్స్ చేజ్ చేయగా.. ఇది ఓవల్లో ఐదో అత్యంత సక్సెస్ ఫుల్ రన్ చేజ్గా నిలిచింది. అయితే, ఇప్పుడు భారత్ విధించిన టార్గెట్ ను ఛేదిస్తే 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లాండ్ జట్టు తిరగరాసినట్లు అవుతుంది.
తాజావార్తలు
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!