భారత యువ షట్లర్ లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. ఇండియా ఓపెన్ 2022లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సింగపూర్ ఆటగాడు, వరల్డ్ ఛాంపియన్ లొహ్ కియన్ యూని 24-21, 21-17 స్కోరు తేడాతో ఓడించాడు. లక్ష్యసేన్కు ఇదే తొలి టైటిల్. అంతేకాకుండా ఈ టైటిల్ను గెలుచుకున్న మూడో భారత పురుష ఆటగాడిగా లక్ష్యసేన్ నిలిచాడు. అతని కంటే ముందు 1981లో ప్రకాష్ పదుకొణె, ఆ తర్వాత 2015లో కిదాంబి శ్రీకాంత్ తొలి సూపర్ 500 ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్నారు.
Read Also: వీసా రద్దు నిర్ణయం.. ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి జకోవిచ్ ఔట్
ఈ మ్యాచ్లో ప్రపంచ చాంపియన్ ముందు లక్ష్యసేన్ దూకుడుగా షాట్లు ఆడి టైటిల్ గెలిచాడు. ఈ మ్యాచ్లో లక్ష్యసేన్ కేవలం 54 నిమిషాల్లో విజయం సాధించాడు. గత ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని సాధించి లక్ష్య సేన్ మెరుపులు మెరిపించాడు. ప్రస్తుతం ఈ టైటిల్ను తన బ్యాగ్లో వేసుకుని పలు రికార్డులను కొల్లగొట్టాడు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలోనూ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కలిసి ఇండోనేషియన్ జంటను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నారు.
