NTV Telugu Site icon

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. జట్ల వివరాలు ఇవే

ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ లో ఇవాళ పంజాబ్‌ కింగ్స్‌ – కోల్‌కతా నైట్‌ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే… ఇందులో టాస్ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. పిచ్‌ కండీషన్స్‌ అంచనా వేసిన..పంజాబ్‌ కింగ్స్‌… మొదట బౌలింగ్‌ చేయడానికే మొగ్గు చూపింది. దీంతో కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టు మొదట గా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ లోకి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుండగా… రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే….

కోల్‌కతా నైట్ రైడర్స్ : శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (సి), నితీష్ రాణా, దినేష్ కార్తీక్ (w/c), టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి

పంజాబ్ కింగ్స్ : KL రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, నాథన్ ఎల్లిస్, మొహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్