Ishan Kishan: నేను హ్యాపీగా లేను.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ బోణి
- నేను హ్యాపీగా లేను అంటూ ఇషాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మొదటి మ్యాచ్లో 38 బంతుల్లోనే 80 రన్స్ చేసిన ఇషాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) బోణి కొట్టడంపై కెప్టెన్ ఇషాన్ కిషన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ బాగా ఆడారని ప్రశంసించారు. తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగా లేనని చెప్పాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు పవర్ప్లేలో అద్భుతంగా ఆడి మంచి ఆరంభం ఇచ్చారని.. ఆ కీలక రన్స్ జట్టు విజయానికి కారణమని ఇషాన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను 65 పరుగుల తేడాతో సన్రైజర్స్ ఓడించింది. ఈ మ్యాచ్లో ఇషాన్ 9 బంతుల్లో 14 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. బెంగళూరుర్ జరిగిన మొదటి మ్యాచ్లో 38 బంతుల్లోనే 80 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ… ‘నా ఆట కంటే జట్టు ఆడిన విధానం నాకు చాలా సంతోషం కలిగించింది. మ్యాచ్కు ముందు అందరూ బాగా ఆడాలని చెప్పాను. మైదానంలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారు. ఇది పూర్తిగా జట్టు విజయం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్ప్లేలో అద్భుతంగా ఆడి మంచి ఆరంభం ఇచ్చారు. ఆ 80 పరుగులు మ్యాచ్ను మాకు విజయానికి దోహదం చేశాయి. మిగతా బ్యాటర్లు పిచ్ను అర్థం చేసుకుని ఆడారు. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ను బాగా ముగించారు. ఫిన్ అలెన్ లాంటి ఆటగాడిని పరుగులు చేయకుండా ఆపడం కష్టం. అదృష్టవశాత్తు త్వరగా అవుట్ అయ్యాడు’ అని చెప్పాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
- IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
Also Read: Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!
‘మా ప్లాన్ చాలా సింపుల్, వికెట్లు తీయడమే. బౌలర్లు ఆ ప్లాన్ను బాగా అమలు చేశారు. యువ బౌలర్ శివాంగ్ కుమార్ను ప్రత్యేకంగా అభినందించాలి. చిన్న మైదానం, మంచి పిచ్ ఉన్నప్పటికీ అతను బాగా బౌలింగ్ చేశాడు. రింకూ సింగ్ లాంటి ఆటగాడికి ఫ్లైట్ బంతులు వేయడం గొప్ప విషయం. అతని శ్రమకు తగిన ఫలితం దక్కింది. విజయం సాధించినా జట్టు ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ప్రతి మ్యాచ్ఓ మేము మా లోపాలను గుర్తిస్తున్నాం. ముఖ్యంగా ఫీల్డింగ్లో మెరుగుపడాలి. ప్రతి మ్యాచ్లో 10-20 పరుగులు అదనంగా ఇస్తున్నాం. టీ20లో ఇది చాలా ప్రభావం చూపుతుంది. దీనిపై మేం దృష్టి పెట్టాం’ అని ఇషాన్ కిషన్ తెలిపాడు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!