Ishan Kishan: నేను హ్యాపీగా లేను.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ బోణి
- నేను హ్యాపీగా లేను అంటూ ఇషాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మొదటి మ్యాచ్లో 38 బంతుల్లోనే 80 రన్స్ చేసిన ఇషాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) బోణి కొట్టడంపై కెప్టెన్ ఇషాన్ కిషన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ బాగా ఆడారని ప్రశంసించారు. తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగా లేనని చెప్పాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు పవర్ప్లేలో అద్భుతంగా ఆడి మంచి ఆరంభం ఇచ్చారని.. ఆ కీలక రన్స్ జట్టు విజయానికి కారణమని ఇషాన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను 65 పరుగుల తేడాతో సన్రైజర్స్ ఓడించింది. ఈ మ్యాచ్లో ఇషాన్ 9 బంతుల్లో 14 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. బెంగళూరుర్ జరిగిన మొదటి మ్యాచ్లో 38 బంతుల్లోనే 80 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ… ‘నా ఆట కంటే జట్టు ఆడిన విధానం నాకు చాలా సంతోషం కలిగించింది. మ్యాచ్కు ముందు అందరూ బాగా ఆడాలని చెప్పాను. మైదానంలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారు. ఇది పూర్తిగా జట్టు విజయం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్ప్లేలో అద్భుతంగా ఆడి మంచి ఆరంభం ఇచ్చారు. ఆ 80 పరుగులు మ్యాచ్ను మాకు విజయానికి దోహదం చేశాయి. మిగతా బ్యాటర్లు పిచ్ను అర్థం చేసుకుని ఆడారు. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ను బాగా ముగించారు. ఫిన్ అలెన్ లాంటి ఆటగాడిని పరుగులు చేయకుండా ఆపడం కష్టం. అదృష్టవశాత్తు త్వరగా అవుట్ అయ్యాడు’ అని చెప్పాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!
‘మా ప్లాన్ చాలా సింపుల్, వికెట్లు తీయడమే. బౌలర్లు ఆ ప్లాన్ను బాగా అమలు చేశారు. యువ బౌలర్ శివాంగ్ కుమార్ను ప్రత్యేకంగా అభినందించాలి. చిన్న మైదానం, మంచి పిచ్ ఉన్నప్పటికీ అతను బాగా బౌలింగ్ చేశాడు. రింకూ సింగ్ లాంటి ఆటగాడికి ఫ్లైట్ బంతులు వేయడం గొప్ప విషయం. అతని శ్రమకు తగిన ఫలితం దక్కింది. విజయం సాధించినా జట్టు ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ప్రతి మ్యాచ్ఓ మేము మా లోపాలను గుర్తిస్తున్నాం. ముఖ్యంగా ఫీల్డింగ్లో మెరుగుపడాలి. ప్రతి మ్యాచ్లో 10-20 పరుగులు అదనంగా ఇస్తున్నాం. టీ20లో ఇది చాలా ప్రభావం చూపుతుంది. దీనిపై మేం దృష్టి పెట్టాం’ అని ఇషాన్ కిషన్ తెలిపాడు.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
-
PrabhasDp : 7 ఏళ్ల తర్వాత డీపీ మార్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియా షేక్..షేక్
-
Gold Price Today: శ్రావణ మాసం వేళ గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఢమాల్.. 24K, 22K రేట్లు ఇవే
-
PM Modi: విభజన నాటి విషాదాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. బాధితుల ధైర్యానికి ప్రశంసలు..
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!