Virat Kohli: టీ20 క్రికెట్లో పాకిస్థాన్కి చెందిన ప్లేయర్ బాబర్ ఆజామ్, భారత్కు చెందిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మధ్య యుద్ధమే జరుగుతోంది. ఇద్దరూ రికార్డులు బ్రేక్ చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇటీవల పాకిస్థాన్ బ్యాట్స్మెన్ బాబర్ అజామ్ కింగ్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. కేవలం 338 ఇన్నింగ్స్ల్లోనే 12,000 పరుగుల మైలురాయిని చేరుకుని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక మన విరాట్ కోహ్లీ మామూలోడు కాదు. ఈ బాబర్ రికార్డు సాధించిన వెంటనే విరాట్ కొత్త రికార్డును సృష్టించాడు. ఓ విధంగా చెప్పాలంటే.. బాబర్ ఆజామ్కు ఇచ్చిపడేశాడు కింగ్ కోహ్లీ.
READ MORE: Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం(ఏప్రిల్ 13న) ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్(MI) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ముంబై బౌలర్లపై విరుచుకుపడుతూ ఆర్సీబీకి కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు ‘సెంచరీ భాగస్వామ్యాల్లో’ (100+ Partnership) భాగమైన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. తన కెరీర్లో 47వ సారి వంద పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు కోహ్లీ. ఈ రికార్డుతో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ను వెనక్కి నెట్టేశాడు. బాబర్ ఆజామ్ (46), వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (46) రికార్డులను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు విరాటుడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (45), ఫాఫ్ డు ప్లెసిస్ (40) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ముంబైతో జరిగిన ఈ పోరులో ఫిల్ సాల్ట్ 36 బంతుల్లోనే 78 పరుగులు చేయగా, కోహ్లీ 50 పరుగులతో తన వంతు సహకారం అందించిన విషయం తెలిసిందే.
