RCB Vs LSG: నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన LSG..

Lsg Vvv

Lsg Vvv

ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది.

కుప్పకూలిన లక్నో బ్యాటింగ్ ఆర్డర్..
లక్నో బ్యాటర్లలో ఎవరూ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి కీలక వికెట్లు వెంటవెంటనే పడిపోయాయి.  మిచెల్ మార్ష్ నిలకడగా ఆడి లక్నో తరఫున అత్యధికంగా 40 పరుగులు (32 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ముకుల్ చౌదరి  39 పరుగులు (28 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. ఆయుష్ బదోని.. 24 బంతుల్లో 38 పరుగులు (4 ఫోర్లు, 1 సిక్సర్) చేసి రాసిఖ్ సలామ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (1), నికోలస్ పూరన్ (1), ఐడెన్ మార్క్రామ్ (12) వంటి స్టార్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరగడం లక్నోను కోలుకోలేని దెబ్బ తీసింది.

Also Read:SBI Bank Scam: ఖాతాదారులకు షాక్.. ఎస్‌బీఐ బ్యాంకులో బిగ్ స్కామ్..

ఆర్సీబీ బౌలర్ల ప్రతాపం.. 
చిన్నస్వామి పిచ్‌పై ఆర్సీబీ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశారు.  రాసిఖ్ సలామ్ అద్భుతమైన స్పెల్‌తో 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి లక్నో వెన్ను విరిచాడు. భువనేశ్వర్ కుమార్ తన అనుభవాన్ని ఉపయోగిస్తూ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేశాడు. క్రునాల్ పాండ్యా తన పాత జట్టుపైనే ప్రతాపం చూపిస్తూ 4 ఓవర్లలో 38 పరుగులిచ్చి 2 వికెట్లు (మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్) తీశాడు. జోష్ హేజిల్‌వుడ్.. జట్టులోకి వచ్చిన తొలి మ్యాచ్‌లోనే పొదుపుగా బౌలింగ్ చేసి, 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 1 వికెట్ (నికోలస్ పూరన్) సాధించాడు. చిన్నస్వామి వంటి బ్యాటింగ్ పిచ్‌పై లక్నోని 146 పరుగులకే పరిమితం చేయడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. 147 పరుగుల లక్ష్యంతో విరాట్ కోహ్లీ సేన ఛేజింగ్‌కు సిద్ధమైంది.