Site icon NTV Telugu

Paris Olympics: మాజీ క్రికెటర్ కుమారుడికి ఒలింపిక్స్ లో రెండు స్వర్ణాలు..

Benjamin

Benjamin

ఒలింపిక్స్ పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ రేసులో అమెరికాకు చెందిన రాయ్ బెంజమిన్ రెండు స్వర్ణాలు సాధించాడు. అతను ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను అందించి 46.46 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. ప్రపంచ రికార్డు-హోల్డింగ్ ఒలింపిక్ ఛాంపియన్ కార్స్టన్ వార్హోమ్‌ను ఓడించడం ద్వారా బెంజమిన్ ఈ విజయాన్ని సాధించాడు. రాయ్ విజయంతో అమెరికా సంబరాలు చేసుకుంటుంది. అమెరికా కంటే ఎక్కువగా కరేబియన్ దేశం ఆంటిగ్వాలో ఈ బంగారు పతకాన్ని ఎక్కువగా జరుపుకొంటున్నారు.

READ MORE: AP Police: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పోలీస్ శాఖలో కొలువుల భర్తీ!

బెంజమిన్ తండ్రి అంతర్జాతీయ క్రికెటర్..
రాయ్ బెంజమిన్ వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్, క్రికెటర్ విన్‌స్టన్ బెంజమిన్ కుమారుడు. ఈయన విన్‌స్టన్ ఆంటిగ్వాకు చెందినవాడు. విన్‌స్టన్ 1986-1995 మధ్య 21 టెస్టులు, 85 ఓడీఐ మ్యాచ్‌లు ఆడి మొత్తం 161 వికెట్లు పడగొట్టాడు. పారిస్ ఒలింపిక్స్‌లో రాయ్ రెండు స్వర్ణాలు సాధించాడు. 400 మీటర్ల హర్డిల్‌ రేస్‌తో పాటు పురుషుల 4×400 మీటర్ల రిలే రేసులోనూ బంగారు పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రాయ్ ఒక స్వర్ణం, ఒక రజతం సాధించాడు.

READ MORE:Punjab: ఇద్దరు యువకులపై ఏఎస్సై దురుసు ప్రవర్తన.. బూటు కాళ్లతో తన్నుతూ..

అమెరికాలో జన్మించిన రాయ్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌ని చేపట్టే ముందు క్రికెట్, అమెరికన్ ఫుట్‌బాల్ కూడా ఆడాడు. అతని కుమారుడు స్వర్ణం గెలిచిన తర్వాత.. విన్‌స్టన్ బెంజమిన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. “ఒలింపిక్స్ నాకు ప్రపంచకప్ ఫైనల్ లాంటిది. నేను పెద్దగా ఎమోషన్‌ చూపించే వ్యక్తిని కాదు. ఇది ఒక అపురూపమైన క్షణం. నా కుమారుడి విజయంపై నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కొడుకు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు.” అని చెప్పారు.

Exit mobile version