NTV Telugu Site icon

నేను చనిపోలేదు.. ఆ వార్తలు నమ్మకండి- రెజ్లర్‌ నిషా దహియా

జాతీయస్థాయి రెజ్లర్‌ నిషా దహియా ఆమె సోదరుడు కాల్పుల్లో మృతిచెందినట్లు వార్తలు గుప్పుమన్నాయి. బుధవారం హరియాణా సోనిపట్‌లోని సుశీల్‌ కుమార్‌ రెజ్లింగ్‌ అకాడమీ వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిషా దహియా ఆమె సోదరుడు సూరజ్ పై కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందినట్లు వార్తల సారాంశం.

అయితే ఈ వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఫేక్ న్యూస్ అని నిషా దహియా ట్విట్టర్ లో ఒక వీడియో ద్వారా తెలిపారు. ” నేను చనిపోలేదు.. ప్రస్తుతం నేను ఉత్తరప్రదేశ్ లోని గోండాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాను.. ఆ వార్తలు అన్ని ఫేక్.. వాటిని నమ్మకండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే నిషా .. ఇటీవలే సెర్బియాలో జరిగిన అండర్‌ -23 విభాగంలో కాంస్య పతకం సాధించారు. అనంతరం ఆమెను ప్రధాని మోదీ కూడా అభినందించిన విషయం తెల్సిందే..