Site icon NTV Telugu

కెప్టెన్‌గా ధావన్ గుడ్ ఛాయిస్ అంటున్నా చహర్…

భారత జట్లలో కోహ్లీ సారధ్యంలోని ఒక్క జట్టు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ అలాగే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుండగా.. మరో జట్టు శ్రీలంక పర్యటనలకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఇప్పుడు ప్లాన్ చేసింది. శ్రీలంక పర్యటనలో భారత్ జులై 13 నుంచి 27 వరకూ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అయితే లంకకు వెళ్లే జట్టుకు కెప్టెన్ రేసులో మొదటగా శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. కానీ అభిమానులతో పాటు కొంత మంది ఆటగాళ్లు కెప్టెన్‌గా గబ్బర్‌కే ఓటేస్తున్నారు. తాజాగా భారత బౌలర్ దీపక్ చహర్ మాట్లాడుతూ… ‘కెప్టెన్‌గా శిఖర్ భాయ్ గుడ్ ఛాయిస్. ఎందుకంటే జట్టులో ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ క్రికెటర్ అతనే. నా అభిప్రాయం ప్రకారం ధావన్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేయడమే సాయినా నిర్ణయం. సీనియర్ ప్లేయర్ కావడంతో ఆటగాళ్లు కూడా అతడ్ని గౌరవిస్తారు. కెప్టెన్‌‌ని ఆటగాళ్లు గౌరవించాలి’ అని అన్నాడు. చూడాలి మరి బీసీసీఐ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది.

Exit mobile version