Site icon NTV Telugu

భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకి కరోనా ముప్పు…?

కొత్త కరోనా వేరియంట్ దక్షిణాఫ్రికాలో ఉద్భవించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడి సౌత్ ఆఫ్రికా జట్టుతో మూడు ఫార్మాట్లలో పోటీ పడనుంది. కానీ ఇప్పుడు ఈ పర్యటన పై కరోనా నీడలు కాముకున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రూపాంతరం చెందిన తర్వాత తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ అంధాత్రిని అప్రమత్తం చేసింది. అయితే కొత్తగా గుర్తించబడిన ఈ వేరియంట్ గురించి WHO సమావేశం నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. కానీ మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20ల కోసం భారత్ వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటన డిసెంబర్ 17న ప్రారంభం కానుంది. కానీ ప్రస్తుతం ఆదేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ పర్యటన వాయిదా పడే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఈ పర్యటన గతంలో జరగాల్సిందే.. కానీ అప్పుడు కూడా దీనిని కరోనానే వాయిదా వేసింది.

Exit mobile version