జూన్ 18-22 మధ్య సౌథాంప్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు 4 వేల మంది ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని హాంప్షైర్ కౌంటీ క్లబ్ ప్రకటించింది. అయితే యూకేలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నామని హాంప్ షైర్ క్లబ్ హెడ్ రోడ్ బ్రన్స్ గ్రోవ్ తెలిపారు. ఇక 2019 సెప్టెంబర్ తర్వాత ఫ్యాన్స్ను అనుమతించడం ఇదే తొలిసారి. అయితే ఈ మ్యాచ్కు చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలామంది ఈ టికెట్లపై ఆసక్తి చూపిస్తున్నారు.’అని బ్రన్స్ గ్రోవ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్ట్ల సిరీస్ కోసం టీమిండియా జూన్ 2న ప్రత్యేక విమానంలో యూకేకు వెళ్లనున్న విషయం తెలిసిందే.