ఆ ఎంపీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తమ్ కుమార్రెడ్డి. ప్రస్తుతం నల్లగొండ ఎంపీ. గతంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే. పీసీసీ మాజీ చీఫ్. ఎంపీగా కిక్కు ఇవ్వలేదో.. అసెంబ్లీనే ముద్దు అనుకుంటున్నారో కానీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారు. హుజూర్నగర్ను విడిచిపెట్టేది లేదని.. ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని ఇటీవలే ఓపెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఉత్తమ్. నల్లగొండ ఎంపీగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ ఏం చేస్తారు అనేదానిపై పార్టీ కేడర్లో ఇన్నాళ్లూ కొంత సస్పెన్స్ ఉండేది. ఆ ఉత్కంఠకు ఆయన తెరదించేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. హుజూర్నగర్తోపాటు కోదాడ కూడా ఉత్తమ్ అడ్డానే. వచ్చే ఎన్నికలకు హుజూర్నగర్ను ఎంచుకోవడంతో కోదాడలో ఆయన అనుచరులు నిరాశ చెందినట్టు చెబుతున్నారు.
కోదాడలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ ప్రకటన రుచించలేదట. 2018 ఎన్నికల సమయంలోనే హుజూర్నగర్ కాకుండా కోదాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఒత్తిడి చేశారు. ఆయన హుజూర్నగర్ను ఎంచుకు భార్య పద్మావతిని కోదాడ బరిలో నిలిపారు. పద్మావతి టీఆర్ఎస్ అభ్యర్తి మల్లయ్య యాదవ్ చేతిలో ఓడిపోయారు. తమ మాటలను ఉత్తమ్ పరిగణనలోకి తీసుకోలేదని సందర్భం చిక్కినప్పుడల్లా కోదాడ కాంగ్రెస్ నేతలు చర్చకు పెడుతూనే ఉన్నారట. కొందరైతే ఇప్పటికీ తమ నాయకుడు ఎదురైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటారని టాక్.
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
ఉత్తమ్ భార్య పద్మావతి కోదాడలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నప్పటికీ.. కెప్టెన్ పోటీలో ఉంటే కలిగే లెక్క వేరని కేడర్ అభిప్రాయంగా ఉంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పాత నియోజకవర్గమైన కోదాడకు ఎప్పటికైనా తిరిగి వస్తారని ఆశిస్తూ వచ్చారట కార్యకర్తలు. ఇదే సమయంలో హుజూర్నగర్లోనే పోటీ చేస్తానని ఉత్తమ్ తేల్చి చెప్పేయడంతో కోదాడ పరిస్థితి ఏంటా అని మల్లగుల్లాలు పడుతున్నారట ఆయన అభిమానులు.. పార్టీ కార్యకర్తలు. వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచి మరోసారి పద్మావతే బరిలో ఉంటారని అనుకుంటున్నారు.
ఇదే సమయంలో కోదాడ కాంగ్రెస్లో మరో చర్చ మొదలైంది. ఉత్తమ్ కుటుంబానికి కాకుండా కొత్త వారికి టికెట్ ఇప్పించేలా పార్టీపై ఒత్తిడి చేయాలని కొందరు ఆలోచిస్తున్నారట. అయితే కాంగ్రెస్లో ఉత్తమ్ను ఎదిరించి.. ఆయన్ని కాదని పార్టీ టికెట్ సాధించడం అయ్యేపనేనా అనే వాదన ఉంది. మొత్తంగా పీసీసీ మాజీ చీఫ్ ప్రకటన కోదాడ కాంగ్రెస్లో పెద్ద అలజడే తీసుకొచ్చింది. మరి.. గుర్రుగా ఉన్న కేడర్ను కెప్టెన్ ఎలా బుజ్జగిస్తారో చూడాలి.
- Tags
- MLA
- Nalgonda
- tcongress
- Uttam kumar
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!