Munugode TRS Assembly : మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనుక ఎత్తుగడ ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode TRS Assembly : మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలో ఎందుకు జాప్యం? గులాబీ వ్యూహం ఏంటి? సభలో పేరు ప్రకటించకపోవడం వెనక ఎత్తుగడ ఉందా? పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోందా? లెట్స్ వాచ్..!
మునుగోడులో మూడు పార్టీల కీలక సభలు అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ముందుగానే తొడ కొడితే.. తర్వాత టీఆర్ఎస్ హోరెత్తించింది. చివరగా అమిత్ షాను రప్పించి రణతంత్రాన్ని వేడెక్కించింది బీజేపీ. కామ్రేడ్లు అధికారపార్టీకి జై కొట్టేశారు. ఇక తేలాల్సింది ఉపఎన్నిక తేదీనే. బరిలో దిగే గెలుపు గుర్రాల పేర్లు వెల్లడి కావాల్సి ఉంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీ నుంచి పోటీలో ఉండబోతున్నారు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరన్నది స్పష్టత లేదు.
Also Read
మునుగోడు సభలోనే టీఆర్ఎస్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ.. అభ్యర్థి ప్రకటన లేకుండానే కేసీఆర్ ప్రసంగం ముగిసింది. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని బరిలో దించుతారని ప్రచారం జరిగింది. కూసుకుంట్లపై లోకల్ పార్టీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేయడం.. అసమ్మతి సమావేశాలు పెట్టుకోవడంతో టీఆర్ఎస్ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. ఉపఎన్నిక తేదీ ఇంకా ఖారారు కాకపోవడంతో వేచి చూసే ధోరణిలోకి టీఆర్ఎస్ వెళ్లినట్టు భావిస్తున్నారు. దీనికితోడు మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న పార్టీ నేతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అది కూడా సభలో అభ్యర్థి ప్రకటన చేయకపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, కర్నాటి విద్యాసాగర్, జడ్పీటీసీలు నారబోయిన రవి.. బొల్ల శివశంకర్ తదితరులు టీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్నారు. కూసుకుంట్ల కానీ.. ఆశవహుల్లో కానీ.. ఎవరో ఒకరికే ఛాన్స్ దక్కుతుంది. వీళ్లెవరూ కాదని అనుకుంటే కొత్తవారిని బరిలో దించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆశావహులు అసంతృప్తికి లోనవకుండా.. పార్టీకి ఉపఎన్నికలో ఇబ్బంది కలుగకుండా.. అందరికీ సర్దిచెప్పే పనిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఈ ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్కు గట్టి గుణపాఠం చెప్పాలన్నది టీఆర్ఎస్ ఆలోచన. అందుకు అనుగుణంగానే అభ్యర్థని ఎంపిక చేస్తారని టాక్.
అభ్యర్థి ఎంపికలో పార్టీ తీసుకుంటున్న జాగ్రత్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులను ప్రగతిభవన్కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడారు. తర్వాత వరసగా మునుగోడుకు చెందిన ఆశావహులను, అసంతృప్తులను పిలిచి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. చండూరులో తదుపరి టీఆర్ఎస్ సభ నిర్వహించేలోపుగానే వడపోతలు కొలిక్కి వస్తాయని అనుకుంటున్నారట. సరైన సమయంలో సరైన అభ్యర్థిని ప్రకటిస్తారని చెబుతున్నారు. చండూరులో సభ ఉంటుందని మునుగోడు మీటింగ్లో కేసీఆర్ చెప్పడంతో.. ఇప్పుడు అందరి దృష్టీ ఆ కార్యక్రమంపై నెలకొంది. అయితే టీఆర్ఎస్ పెద్దల దృష్టిలో ఎవరు ఉన్నారు అన్నదే ఉత్కంఠ రేపుతోంది.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..