Palamuru TRS : టీఆర్ఎస్ ఆశావాహులు అక్కడ గందరగోళాన్ని సృష్టిస్తున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్లోని ఆశావహులు అక్కడ గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమదే అని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు? ఈ పోరు శ్రుతిమించి రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారుతోందా? కేడర్లోనూ గందరగోళానికి దారితీస్తోందా? లెట్స్ వాచ్..!
పాలమూరు జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన సమైక్యతా ర్యాలీ టీఆర్ఎస్లోని రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్పై దాడి జిల్లాలో చర్చగా మారింది. కొన్ని రోజులుగా అలంపూర్లో ఎమ్మెల్యే అబ్రహంను విభేదించే పార్టీ కేడర్తో టచ్లో ఉన్నారట సాయిచంద్. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి అలంపూర్ భవిష్యత్ ఎమ్మెల్యే తానే అని సాయిచంద్ ప్రచారం చేసుకుంటున్నారట. సీఎంతోపాటు టీఆర్ఎస్ పెద్దలు అలంపూర్లో పనిచేసుకోమని చెప్పారని ఫీల్డ్లో తిరగడం.. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం వర్గానికి రుచించడం లేదు. సాయిచంద్ పీఏ సైతం మండలస్థాయి నేతలకు ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరడంతో సమస్య పీక్స్కు వెళ్లిందని టాక్. దీనికితోడు ఈ నెల 20న తన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు సాయిచంద్ ఏర్పాట్లు చేసుకోవడం ప్రత్యర్థి శిబిరానికి మంటెక్కించింది.
Also Read
ఎమ్మెల్యే అబ్రహం వచ్చే ఎన్నికల్లో తన కూమారుడు అజయ్ ను బరిలో దించే ఆలోచనలో ఉన్నారు. పార్టీ పెద్దలకు కూడా ఆ విషయాన్ని తెలిపారట. ఇప్పటికే అలంపూర్లో అజయ్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో అలంపూర్ టికెట్ను మాజీ ఎంపీ మందా జగన్నాథం, జడ్పీ మాజీ ఛైర్మన్ భాస్కర్ ఆశిస్తున్నారు. దీనికితోడు ఇంచార్జీ మంత్రిగా నిరంజన్రెడ్డి గ్రూప్ లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయట. గద్వాల జడ్పి చైర్మన్ సరితా తిరుపతయ్య దంపతులు ఎమ్మెల్యే వ్యతిరేకులకు మద్దతిస్తున్నారట. ఇప్పుడు సాయిచంద్ ఎంట్రీతో గ్రూపుల గోల పెరిగిపోయింది.
ఎమ్మెల్యే అబ్రహంను వయోభారంతో పక్కన పెడతారని ఆయన వ్యతిరేకులు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అవి ఘర్షణలకు దారితీస్తున్నాయి. సరిగ్గా సాయిచంద్ సైతం అలంపూర్లో సమైక్యతా ర్యాలీకి హజరు కావడం, తన వర్గీయులతో హడావిడి చేయడంతో ఎమ్మెల్యే శిబిరం ఫైర్ అయ్యింది. ఇదే జిల్లాకు చెందిన సాయిచంద్.. గతంలో నాగర్ కర్నూల్ ఎంపీ, జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్సీ పదవులు ఆశించి భంగపడ్డారు. ఇంతలో నామినేటెడ్ పదవి ఇచ్చింది పార్టీ. ఆ హోదాలో అలంపూర్ టికెట్ సాధించి.. అక్కడ పోటీ చేయాలని చూస్తున్నారు.
మొన్నటి వరకు ఆశావహులు.. ఎమ్మెల్యే శిబిరాల మధ్య విమర్శలు, సవాళ్లు నడిచేవి. ఇప్పుడు మాత్రం ఆధిపత్యపోరు రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారడంతో రేపటి రోజున ఏం జరుగుతుందో అనే సందేహాలు కేడర్లో ఉన్నాయట. మరి.. సమస్య ముదురుపాకాన పడకుండా పార్టీ పెద్దలు నేతల మధ్య సయోధ్య చేస్తారో లేక.. టికెట్ ఎవరికో క్లారిటీ ఇస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!