కమలనాథుల్లో కలహాలు పెరిగాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాషాయ శిబిరంలో కషాయం డోస్ ఎక్కువైందా? కమలనాథుల్లో కలహాలు పెరిగాయా? నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయట పడుతున్నాయా? పార్టీ సారథి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయా? ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు? క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకొనే ఆ జాతీయపార్టీలో అసలేం జరుగుతోంది?
కమలం శిబిరంలో ఏం జరుగుతోంది?
తెలంగాణలో బీజేపీ పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉందా? నానాటికీ పార్టీ తీసికట్టుగా మారుతోందా? బీజేపీలోని ముఖ్య నాయకులు ఒకరి తీరుపై మరొకరు ఓపెన్గా కామెంట్స్ చేయడం.. అంతర్గతంగా ఫిర్యాదులు చేసుకోవడం ఎక్కువై.. కమలం శిబిరంలో ఏం జరుగుతుందో కేడర్కు అంతుచిక్కడం లేదట. పైకి నాయకులంతా కలిసి కట్టుగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. వాళ్ల మధ్య పూడ్చలేనంత గ్యాప్ ఉందన్నది కొందరి వాదన.
Also Read
బీజేపీ నేతల మధ్య ఆత్మీయత లేదా?
ఇటీవల దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగుచోట్ల బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చినా.. ఆ విక్టరీ ఎఫెక్ట్.. సంతోషం.. సందడి పార్టీ నాయకులు ఎవరి దగ్గరా లేదట. అంతా ఏదో వెలితితో బాధపడుతున్నట్టు సమాచారం. బీజేపీ నేతలంతా ఒక కుటుంబంలా ఉండాలని చెబుతారు. కానీ.. పార్టీ లీడర్స్ మధ్యే ఆత్మీయత లేదని టాక్. ఎవరికి వారు తాము పెద్ద నాయకులుగా ఫీల్ కావడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. కలిసి పనిచేయడం మర్చిపోయారట.
సంజయ్ వ్యాఖ్యల వెనక కథేంటి?
ఇదే సమయంలో కొందరు పార్టీ నాయకులు తరచూ చేస్తున్న కామెంట్స్ విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయట. అంతర్గత పోరు ఇంకా రాజుకోవడానికి ఆ వ్యాఖ్యలు దోహదం చేస్తున్నాయని చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడిన సమయంలో చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం బీజేపీలో హాట్ టాపిక్గా మారాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశారు అన్నది పెద్ద ప్రశ్న.
బీజేపీలో ఇద్దరు మాజీ మంత్రుల తీరుపై చర్చ
బీజేపీలో కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. టికెట్స్ ఇప్పిస్తామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. టికెట్స్ ఇప్పిస్తామన్న వారికి.. వారి వెంట టికెట్స్ కోసం తిరిగే వాళ్లకు పార్టీ ఛాన్సే ఇవ్వబోదని కుండ బద్దలు కొట్టేశారు సంజయ్. ఉత్తరప్రదేశ్లో ఇదేవిధంగా చెప్పుకొన్నవాళ్లకు పార్టీ టికెట్ ఇవ్వలేదని.. సీఎం అవుతామని చెప్పుకొన్నవాళ్లు కూడా ఎక్కడా ముఖ్యమంత్రి కాలేదని సంజయ్ తెలిపారు. అయితే ఆయన బీజేపీలో ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారన్నది కమలనాథుల మధ్య చర్చగా మారింది. ఇద్దరు మాజీ మంత్రులను ఉద్దేశించే సంజయ్ ఆ వ్యాఖ్యలు చేశారనేది కొందరి వాదన.
తరచూ అవమానిస్తున్నారని రఘునందన్రావు ఫైర్
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రొటోకాల్ పంచాయితీ కూడా కాషాయ శిబిరంలో సెగలు రేపుతోంది. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఆయన ఉన్నారట. తరచూ అవమానిస్తున్నారని పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శికి రఘునందన్రావు ఫిర్యాదు చేసినట్టు బయటకొచ్చింది. సంజయ్ మొదటిదశ పాదయాత్ర ముగింపు సభ తమ జిల్లాలో జరిగితే వేదికపై కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. రెండో విడత సంగ్రామ యాత్ర సన్నాహక సమావేశంలోనూ తనను స్టేజ్ మీదకు పిలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారట రఘునందన్రావు. అలాగే అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్.. విప్లను ఎందుకు నియమించడం లేదని కూడా ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
సంజయ్ కామెంట్స్.. రఘు ఫిర్యాదులతో పెరిగిన సెగలు
అటు సంజయ్ వ్యాఖ్యలు.. ఇటు రఘునందన్రావు ఫిర్యాదులు చూశాక కాషాయ శిబిరంలో సెగలు పెరిగాయి. పాదయాత్ర కారణంగా దాదాపు నెలరోజులపాటు సంజయ్ పార్టీ హెడ్ ఆఫీస్కు అందుబాటులో ఉండరు. ఈ సమయంలో ఇంకెలాంటి కలహాలు బయట పడతాయో అని చెవులు కొరుక్కుంటున్నారట కమలనాథులు. ఈ అంశాలు ఢిల్లీ నాయకత్వం వరకు వెళ్తున్నాయో లేదో కానీ.. అక్కడి నుంచి యాక్షన్ లేకపోతే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారట.
తాజావార్తలు
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!