NTV Telugu Site icon

YS Jagan : నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు

Ys Jagan

Ys Jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో జయంతి వేడుకలతో పాటు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇడుపుల­పాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి నివాళులు అర్పిం­చి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ట్విట్టర్‌ వేదికగా ‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం.జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరివరకూ మా కృషి.’ అని పోస్ట్‌ చేశారు వైఎస్ జగన్.