Site icon NTV Telugu

YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై మాట్లాడనున్న మాజీ సీఎం!

Jagan Ys

Jagan Ys

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మీడియా సమావేశంలో ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన పలు అంశాలపై జగన్ స్పందించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా తిరుమల లడ్డూ వ్యవహారం, పరకామణి అంశం, కాగ్ నివేదిక, అలాగే రాష్ట్రంలో ఉన్న రైతాంగ సమస్యలు వంటి విషయాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించనున్నారని తెలుస్తోంది.

Also Read: Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పు తీర్చేస్తారు!

అదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలపై కూడా వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో జగన్ ఏం మాట్లాడుతారన్నది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.’

Exit mobile version