Wrestlers Protest : మేమే నేరస్తులమయ్యాం.. మా ఫోన్లు ట్రాక్ చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wrestler Protest : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణ నేపథ్యంలో రెజ్లర్ల నిరసన 18వ రోజుకు చేరుకుంది. ధర్నాలో కూర్చున్న వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, సత్యవ్రత్ కడియన్లు తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. బ్లాక్ డే గా పేర్కొంటూ..నల్ల బ్యాండ్లు ధరించారు. కొంతమంది మద్దతుదారులు బ్రిజ్ భూషణ్పై చర్య తీసుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా వారి చేతులపై వాటిని ధరించారు. మైనర్తో సహా పలువురు మహిళా గ్రాప్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అన్ని ఆరోపణలను తిరస్కరించిన బిజెపి ఎంపిపై ఢిల్లీ పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ 10 కింద ఒకటి సహా రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు.
Read Also: Katharine Hepburn: మరపురాని కేథరిన్ హెబ్బర్న్!
Also Read
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
తాజాగా బజరంగ్ పునియా మీడియాతో మాట్లాడారు. తమ ఫోన్ నంబర్లు ట్రాక్ చేస్తున్నారంటూ ఆరోపించారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు నిరసనగా తాము నేడు బ్లాక్ డేగా పాటిస్తున్నామన్నారు. తమ పోరాటానికి మద్దతుగా ఈ దేశమే నిలుస్తుందనీ, తమ పోరాటంపై తమకు నమ్మకం ఉందని బజరంగ్ పునియా అన్నారు. రోజురోజుకు తమ నిరసన ఉధృతమవుతోందనీ, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తమ ఫోన్ నంబర్లను ట్రాక్ చేస్తున్నారని మమ్మలను నేరం చేసినట్లు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా తమ కాంటాక్ట్లో ఉన్న వారిని ట్రాక్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
Read Also:KKR vs RR : కోల్కతాపై రాజస్తాన్ ఘన విజయం.. దుమ్మలేపిన జైస్వాల్
ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్, ఒలింపిక్ పతక విజేత అథ్లెట్ సీమా యాంటిల్ మాట్లాడుతూ..రెజర్ల నిరసన శిబిరాల వల్ల తమ ప్రాక్టీస్ సజావుగా సాగడం లేదన్నారు. దీంతో తమ ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. సీమా యాంటిల్ వ్యాఖ్యలను పునియా తప్పు బట్టారు. బ్రిజ్ భూషణ్ కంటే మనం ఆటకు నష్టం కలిగిస్తున్నామని ఆమె చెబుతున్నట్లు నాకు అర్థం కావడం లేదు. క్రీడాకారిణి అయినప్పటికీ ఆమె ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోవడం చాలా విచిత్రంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే భారత్ కిషన్ యూనియన్ ఏక్తా (ఆజాద్) ప్రతినిధి బృందం, పంజాబ్కు చెందిన మహిళలతో గురువారం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను మద్దతుగా నిలిచి.. వారి సంఘీభావాన్ని తెలిపారు.
తాజావార్తలు
-
Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
-
Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
-
ITR Filing Benefits: ఐటీఆర్ దాఖలు చేస్తే లాభాలే లాభాలు.. తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!