Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..
ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా శనివారం జరిగిన క్షిపణి (ప్రాజెక్టైల్) దాడి అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) కీలక ప్రకటన విడుదల చేస్తూ.. అణు కేంద్రం సమీపంలో క్షిపణి పడినప్పటికీ, ప్రస్తుతానికి రేడియేషన్ ముప్పు లేదని స్పష్టం చేసింది. ఇరాన్ అణు ఇంధన సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. ఈ దాడిలో అణు విద్యుత్ కేంద్రం ఆవరణలోని ఒక భవనం తీవ్రంగా దెబ్బతిన్నది. క్షిపణి పేలుడు వల్ల సంభవించిన షాక్వేవ్స్ (Shockwaves), చెల్లాచెదురైన తునకల కారణంగా భవన నిర్మాణం పాడైంది. దురదృష్టవశాత్తూ.. ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిలో ఒకరు క్షిపణి తునకలు తగిలి మరణించినట్లు ఐఏఈఏ ధృవీకరించింది. గత కొన్ని వారాలుగా ఈ కేంద్రం పరిసరాల్లో ఇలాంటి దాడులు జరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
Also Read:Pakistan: పాకిస్తాన్కు భారీ షాక్.. అప్పు చెల్లించాలని యూఏఈ ఒత్తిడి..
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
రేడియేషన్, భద్రత..
దాడి జరిగిన వెంటనే అణు కేంద్రం పరిసరాల్లో రేడియేషన్ స్థాయిలను అధికారులు పరీక్షించారు. రియాక్టర్ ఉన్న ప్రధాన విభాగానికి ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో రేడియేషన్ పెరగలేదని, ప్రజలకు ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని ఐఏఈఏ పేర్కొంది. అయితే.. దెబ్బతిన్న సహాయక భవనాల్లో కీలకమైన భద్రతా పరికరాలు లేదా పర్యవేక్షణ వ్యవస్థలు ఉండే అవకాశం ఉన్నందున, ఆ నష్టం అణు కేంద్రం పనితీరుపై ప్రభావం చూపుతుందా అన్న కోణంలో విశ్లేషిస్తున్నారు.
IAEA చీఫ్ హెచ్చరిక..
ఈ పరిణామంపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫాయెల్ గ్రోస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “అణు విద్యుత్ కేంద్రాలు యుద్ధ క్షేత్రాలు కాకూడదు. వాటిపై లేదా వాటి పరిసర ప్రాంతాలపై దాడులు చేయడం అత్యంత ప్రమాదకరం” అని ఆయన హెచ్చరించారు. అణు కేంద్రాల భద్రత విషయంలో అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల భారీ విపత్తు సంభవించే అవకాశం ఉంటుందని.. తక్షణమే ఇలాంటి దాడులు నిలిపివేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?